కేసీఆర్ కు అధికారమివ్వటమే ప్రజలు చేసిన పెద్ద తప్పు

కేసీఆర్ కు అధికారమివ్వటమే ప్రజలు చేసిన పెద్ద  తప్పు

కృష్ణా జలాల్లో అన్యాయం జరిగాక లేఖలు రాయడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా - పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు జితేందర్ రెడ్డి. రాయలసీమను రత్నాల సీమ చేసే ముందు కేసీఆర్ తెలంగాణను పట్టించుకోవాలన్నారు. త్వరలోనే కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేస్తుందని చెప్పారు జితేందర్ రెడ్డి. కెసిఆర్ కు అధికారం ఇవ్వటమే తెలంగాణ ప్రజలు చేసిన పెద్ద తప్పన్నారు. కేసీఆర్ కు కుటుంబ పాలనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు.