గడ్డపారలతో ఎంపీ కార్యాలయం ధ్వంసం చేశారు

గడ్డపారలతో ఎంపీ కార్యాలయం ధ్వంసం చేశారు

టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్. ఇది ప్రజాస్వామ్యమా లేక అరచకమా అని ప్రశ్నించారు. రోజు రోజుకు బీజేపీ బలపడుతోందనే సర్కార్ అణిచివేత కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవ్వరూ భయపడరన్నారు. గ్యాస్ కట్టర్ లు, గడ్డపారలతో ఎంపీ కార్యాలయం తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారన్నారు. స్వయంగా సీపీ ఇందులో పాల్గొన్నారని.. దీనిపై NHRCకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామన్నారు లక్ష్మణ్.