కమిషన్లకోసమే కాళేశ్వరం కట్టారు.. పదేండ్లు ప్రజాధనం వృధా చేశారు: ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి

కమిషన్లకోసమే  కాళేశ్వరం కట్టారు.. పదేండ్లు ప్రజాధనం వృధా చేశారు: ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి

కమీషన్లకోసమే కాళేశ్వరం కట్టారని మునుగోడు ఎమ్మెల్యేరాజ్​ గోపాల్ రెడ్డి  గత బీఆర్​ ఎస్​ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరంతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. లక్ష ల కోట్లు ఖర్చు చేస్తే మనకు చుక్క నీరు రాలేదన్నారు. పదేండ్లు ప్రజాధనం వృధా చేశారన్నారు. కేసీఆర్​ ఓ నియంతలా పాలించాడు.. నార్త్​ తెలంగాణ,  సౌత్​ తెలంగాణ పేరుతో  వివక్ష చూపారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజ్​ గోపాల్​రెడ్డి అన్నారు. 

రిజర్వాయర్లకోసం ఎంతో మంది రైతులు భూములిచ్చారు. రిజర్వాయర్లు కడితే సరిపోదు.. కాల్వలు తవ్వించాలి.. మంత్రులు, సీఎం నియోజకవర్గాల్లోనే పనులు జరిగాయన్నారు. కొడంగల్​ గెలిపించింది .. కొడంగల్​ అభివృద్ది అని సీఎం అంటున్నారు. మమ్మల్ని కూడా మునుగోడు ప్రజలు గెలిపించారు. వారికి ఏమిచ్చారని ప్రశ్నించారు. 

►ALSO READ | తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు చరిత్రాత్మకం: ఎమ్మెల్యే కూనంనేని

మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజ్​ గోపాల్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి  న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్​ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్​ ప్రపంచంలో  ఎక్కడా లేదు..ఏ ప్రాజెక్టు వచ్చినా ఖమ్మం జిల్లాకే వెళుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు  ఉన్నారు..మంత్రులు, సీఎం నియోజకవర్గాల్లోనే  పనులు జరుగుతున్నాయి..ఎమ్మెల్యేలు లేనిది ఈ ప్రభుత్వం ఏర్పడిందా..ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోకూడా  పనులు  జరగాలని రాజ్ గోపాల్ రెడ్డి కోరారు.