ఈసారి 400కు పైగా స్థానాల్లో గెలుస్తం : ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్

ఈసారి 400కు పైగా స్థానాల్లో గెలుస్తం :  ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్
  • బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: అవినీతికి, కుంభకోణాలకు, కుటుంబపాలనకు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్​ గ్యారంటీ అని..ఇక తుక్కుగూడ సభతో ఆ పార్టీ ప్రజలకు ఇచ్చే గ్యారంటీ ఏముంటుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారని తెలిపారు. 

అంతేగాని ఆ పార్టీపై  ఎవరికీ అభిమానం లేదని చెప్పారు. దేశంలో ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఏదో ఒక భావోద్వేగంతో ఓటు వేశారని... ఈసారి మోదీని మరోసారి గెలిపించాలన్న భావోద్వేగంతో ఓటు వేస్తారని వెల్లడించారు. ఈసారి బీజేపీ 400కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తులా ప్రజానీకానికి గ్యారంటీ ఇచ్చేదని ప్రశ్నించారు. తుక్కుగూడ సమావేశం కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడగొడ్తదని,  దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని ప్రభాకర్ పేర్కొన్నారు.