కమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు

కమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు

కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది. అసెంబ్లీ సాక్షిగా హామి ఇచ్చి.. ఇవాళ నేను చెప్పలేదని కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు. కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు. కడుపు నిండా తిన్న తర్వాత ధర్నా చేయడం కాదు... ధాన్యం కోనుగోలు చేయాలి. కేసీఆర్‎ నీకు కమీషన్లు కావాలంటే చందాలు వసూలు చేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు. బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం ముందే చెప్పింది.. అయినా కేసీఆర్  ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోంది. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మూడేండ్లు అయినా ఎందుకు చేయలేదు? హుజారాబాద్ ఓటమితో కేసీఆర్‎కు భయం పట్టుకుంది. హమాలీలకు కేంద్రం ఇచ్చిన డబ్బులను కేసీఆర్ వాడుకున్నారు. కేసీఆర్.. తోక పార్టీ కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గు చేటు. మీరు మీ డ్రామాలు ఆపండి. ప్రజలకు కేసీఆర్ డ్రామాలు అర్థమయ్యాయి. కొత్త రైతు చట్టలతో రైతులకు మేలు కలుగుతుంది. సూర్యాపేటలో రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు. కేసీఆర్ నీ‎కు చేతకాకపోతే దిగిపో... బీజేపి ప్రజలను పాలిస్తుంది. కేంద్రం గురి పెట్టిందంటే తట్టుకోలేవు కేసీఆర్’ అని విజయశాంతి హెచ్చరించారు.