కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది. అసెంబ్లీ సాక్షిగా హామి ఇచ్చి.. ఇవాళ నేను చెప్పలేదని కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు. కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు. కడుపు నిండా తిన్న తర్వాత ధర్నా చేయడం కాదు... ధాన్యం కోనుగోలు చేయాలి. కేసీఆర్ నీకు కమీషన్లు కావాలంటే చందాలు వసూలు చేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు. బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం ముందే చెప్పింది.. అయినా కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోంది. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మూడేండ్లు అయినా ఎందుకు చేయలేదు? హుజారాబాద్ ఓటమితో కేసీఆర్కు భయం పట్టుకుంది. హమాలీలకు కేంద్రం ఇచ్చిన డబ్బులను కేసీఆర్ వాడుకున్నారు. కేసీఆర్.. తోక పార్టీ కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గు చేటు. మీరు మీ డ్రామాలు ఆపండి. ప్రజలకు కేసీఆర్ డ్రామాలు అర్థమయ్యాయి. కొత్త రైతు చట్టలతో రైతులకు మేలు కలుగుతుంది. సూర్యాపేటలో రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు. కేసీఆర్ నీకు చేతకాకపోతే దిగిపో... బీజేపి ప్రజలను పాలిస్తుంది. కేంద్రం గురి పెట్టిందంటే తట్టుకోలేవు కేసీఆర్’ అని విజయశాంతి హెచ్చరించారు.
కమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు
- తెలంగాణం
- November 19, 2021
లేటెస్ట్
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
- DC vs LSG: పొరెల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. లక్నో ఎదుట భారీ టార్గెట్
- నటి కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?
- Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Northern Lights:ఆకాశంలో రంగుల తుపాను ‘అరోరా’ గురించి మీకు తెలుసా?
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు