అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ తమకు రాజకీయ గురువులని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ‘ఏ విషయంలో కాంప్రమైజ్ గాని గొప్ప నేతలు అటల్ బీహార్ వాజ్ పేయి, అద్వానీ. భారతీయ జనతా పార్టీలో నేతలకు డిసిప్లిన్ ఎంతో ప్రధానమైంది. అటల్ బిహారీ వాజ్ పేయి సిద్ధాంతాలను నమ్ముకొని నేటి ప్రధానమంత్రి మోడీ ముందుకు పోతున్నారు. రాష్ట్రంలో 2024లో బీజేపీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ పాలన అంతం కావాలి’ అని విజయశాంతి అన్నారు.
For More News..
కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులే