రామగుండంలో కాషాయ జెండా ఎగరేస్తాం

రామగుండంలో కాషాయ జెండా ఎగరేస్తాం

రామగుండం కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగరేస్తామన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. CAA, NRCపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మున్సిపల్ ఎన్నికల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వచ్చిన కమిషన్లతో సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు.