ప్రతీ కార్యకర్త చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి

ప్రతీ కార్యకర్త చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి

గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు  వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, విజయశాంతి గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి వస్తువు దేశంలో తయారయ్యేలా చేస్తున్నామని చెప్పారు. 15 రోజుల పాటు సేవా పక్షం పేరుతో సేవా కార్యక్రమాలు చేశామని  ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ ఆదేశాలతో గాంధీ జయంతి రోజున నేతలు బీజేపీ ఆఫీసులో చేనేత వస్త్రాలను కోనుగోలు చేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న నేతలు... ప్రధాని మోడీ చెప్పిన ప్రకారం ప్రతీ కార్యకర్త చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆఫీసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.