హైదరాబాద్ నెరేడిమేట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయాన్నిబీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించింది. ఈ మేరకు పోలీసులు అడ్డుకోవడంతో కమిషనరేట్ కార్యాలయం ముందు మహిళలు ఆందోళన నిర్వహించారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.