బీజేపీ నేతల ముందస్తు అరెస్టులపై రాజాసింగ్ ఫైర్

బీజేపీ నేతల ముందస్తు అరెస్టులపై రాజాసింగ్ ఫైర్

ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింల కోసం పోరాడేది బీజేపీ పార్టీ ఒక్కటే అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ కోసం బీజేపీ నేతలు నిరసన తెలియచేస్తే ముందస్తు అరెస్టులు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్లు అసెంబ్లీలో మెట్రో కావాలంటారని.. సీఎం ఛాంబర్ కు వెళ్లి మెట్రో వద్దంటారని విమర్శించారు. ఓల్డ్ సిటీ డెవలప్ అయితే ఎంఐఎం పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉండదనే.. అభివృద్ధి కానివ్వండం లేదని రాజాసింగ్ ఆరోపించారు. 

హైదరాబాద్ పాత బస్తీలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మెట్రో రైల్ ను పాతబస్తీ వరకు విస్తరించారించాలని డిమాండ్ చేశారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గౌలిపుర డివిజన్ బీజేపీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మీ చేతికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసలు చేశారు.