త్వరలో వరి రైతులకు మంచి రోజులొస్తయ్

త్వరలో వరి రైతులకు మంచి రోజులొస్తయ్

ఒక్క ఫోన్ తో సీఎం కేసీఆర్,కేటీఆర్,టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తానన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోన్నారు. కేసులు పెట్టి మా అంటే ఎన్నికల వరకు తనను జైల్లో పెడతారన్నారు. తాను ఏ పోలీసులను బూతులు తిట్టలేదన్నారు. లొట్టపీస్ అన్నానని తనపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారన్నారు.  కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సీఎం కేసీఆర్ నానా బూతులు తిట్టారని..మరి కేసీఆర్ పై ఎలాంటి కేసులు పెట్టారని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ విధానాలతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్నారు ఎంపీ అర్వింద్. త్వరలో వరి రైతులకు మంచి రోజులు వస్తాయని...మిల్లర్లే రైతుల దగ్గరకు వచ్చే రోజులు ముందున్నాయన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందన్నారు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రిసైక్లింగ్ పేరుతో బియ్యం దందా సాగుతోందని ఆరోపించారు. 317 జీవోతో ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు అర్వింద్.