నితీశ్ కుమార్ కు ప్రజలు ఓట్లతో సమాధానం చెప్తారు

నితీశ్ కుమార్ కు ప్రజలు ఓట్లతో సమాధానం చెప్తారు

బిహార్ లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ కు ప్రజలు తగిన సమాధానం చెప్తారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. నితీశ్ కాంగ్రెస్ సిద్ధాంతాల వ్యతిరేకి అని అన్నారు. ఆయన రాజకీయం కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధంగానే ఉండేదని చెప్పారు. కాంగ్రెస్ వాదం, అవినీతితో నితీశ్ రాజీ అయ్యారన్న రవిశంకర్ ప్రసాద్.. కాంగ్రెస్ వాదం వైపుకు నిలిచిన నితీశ్ కు అభినందనలు అని విమర్శించారు. 

బిహార్ లో నితీశ్ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ మహాధర్నా చేపట్టింది బీజేపీ. పాట్నాలోని బీజేపీ కార్యాలయం దగ్గర నిరసనలు చేపట్టారు. నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. NDAతో తెగదెంపులు చేసుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనని ఆరోపించారు బీజేపీ నేతలు. RJDతో పొత్తు పెట్టుకోవడంతో బిహార్ ను అశాంతి, అవినీతిలోకి నెట్టేస్తున్నారని నితీశ్ ను విమర్శించారు. ఈనెల 12న జిల్లా కేంద్రాల్లోనూ బిహార్ సర్కారుకు వ్యతిరేకంగా ధర్నా చేపడతామన్నారు బీజేపీ నేతలు. ఈనెల 13న అన్ని హెడ్ క్వార్టర్లలోనూ ధర్నా నిర్వహిస్తామన్నారు.