ఆరేళ్ల చిన్నారిపై రేప్‌ చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ఆరేళ్ల చిన్నారిపై రేప్‌ చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

అత్యాచారానికి గురై నీలోఫర్ లో చికిత్స పొందుతున్న ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూడాలన్నారు. టీఆర్ఎస్ కు చెందిన నేత ఇంలాంటి దుశ్చర్యకు పాల్పడటం దారుణమన్నారు. కేటీఆర్‌‌ పరామర్శించి వెళ్లినా బాధిత కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదన్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు వివేక్.