నాంపల్లిలో బీజేపీ సభ సందడి

నాంపల్లిలో బీజేపీ సభ సందడి

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, పరిసరాలు కాషాయ రంగులో మెరిసిపోతున్నాయి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగత్ ప్రకాశ్ నడ్డా తొలిసారి హైదరాబాద్ కు రావడంతో.. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు పార్టీ నాయకులు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లిలో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొనబోతున్నారు. నమో భారత్ – నవ తెలంగాణ నినాదంతో.. ఈ పబ్లిక్ మీటింగ్ ను నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటుచేశారు.

రాష్ట్ర టీడీపీ, ఇతర పార్టీల నుంచి నాయకులు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరబోతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు సహా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు.