శంషాబాద్ ఎయిర్​పోర్ట్ రన్‌‌వేపై చిరుత

శంషాబాద్ ఎయిర్​పోర్ట్ రన్‌‌వేపై చిరుత
  • పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసిన అధికారులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ రన్ వేపై చిరుత కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రన్‌‌‌‌‌‌‌‌వేపై చిరుత కనిపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రన్‌‌‌‌‌‌‌‌వేపై చిరుతను గమనించిన పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అధికారులు అటవీ శాఖకు సమాచారం అందించారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఇప్పటికే బోను ఏర్పాటు చేశారు. కాగా, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. చిరుత సంచరిస్తుందనే విషయం తెలిసి స్థానిక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.