తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు బీజేపీ  రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిజెపి నియోజకవర్గ స్థాయి సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. తమ పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకే కొత్త వాళ్లకు అవకాశం ఇస్తానని కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు. 317 జీవోపై ఇప్పటికైనా కేసీఆర్ పునరాలోచించాలన్నారు. స్పౌజ్ బదిలీలకు, మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక జీవో ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని తెలిపారు. జాతీయ నాయకులతో కలిసి ఉద్యోగ సంఘాల నాయకులతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు బండి సంజయ్.

మరిన్ని వార్తల కోసం

డ్రగ్ కస్టమర్లను ట్రేస్ చేస్తున్నరు

హైదరాబాదీ పిల్లాడికి ప్రధాన మంత్రి బాల పురస్కారం