రిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీనే : జాజుల శ్రీనివాస్ గౌడ్

రిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీనే : జాజుల శ్రీనివాస్  గౌడ్

హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లను నీరు గార్చిందే బీజేపీ ప్రభుత్వం అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  గౌడ్  అన్నారు. ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికగా అగ్రకుల రిజర్వేషన్లను తీసుకొచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఉల్లంఘించిందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గత పదేండ్లుగా ప్రధాని నరేంద్ర మోదీకి  విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. 

ఆర్థిక వెనుకబాటు అనే అసంబద్ధమైన కారణం చూపుతూ రాత్రికిరాత్రే అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించారని ఆయన ప్రశ్నించారు. ‘‘అగ్రవర్ణాలకు బీసీలు ఎప్పటికీ వ్యతిరేకం కాదు. కానీ, సామాజిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సిద్ధాంతాన్ని విస్మరించి ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం కరెక్టు కాదు” జాజుల పేర్కొన్నారు.