త్రిపురను కాపాడేది బీజేపీయే : అమిత్‌‌‌‌ షా

త్రిపురను కాపాడేది బీజేపీయే : అమిత్‌‌‌‌ షా

చండీపూర్‌‌‌‌‌‌‌‌(అగర్తలా): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురను ట్రిపుల్‌‌‌‌ ట్రబుల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌, తిప్రమోత, సీపీఎంలనుంచి డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ బీజేపీ మాత్రమే రక్షించగలదని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా అన్నారు. చాలాకాలంగా త్రిపురలో ఆదివాసీలకు లెఫ్ట్‌‌‌‌ పార్టీలు ద్రోహం చేస్తున్నా యని, ఇప్పుడు కూడా ఒక గిరిజన డూప్‌‌‌‌ నాయకుడిని సీఎం అభ్యర్థిగా చూపిస్తున్నాయ ని అన్నారు. రాష్ట్రాన్ని ఈ ట్రిపుల్‌‌‌‌ ట్రబుల్‌‌‌‌ నుంచి రక్షించాలనుకుంటే డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు.

ఆదివారం ఇక్కడ ఊనకోటి జిల్లాలో షా మాట్లాడారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్‌‌‌‌, లెఫ్ట్‌‌‌‌ పార్టీలు కలిసి పోటీ చేయడంతోనే ఆ పార్టీలు తమ ఓటమిని అంగీకరించినట్లు అయిందన్నా రు. తర్వాత బిష్రామ్‌‌‌‌గంజ్‌‌‌‌లో జరిగిన మరో ర్యాలీలో అమిత్‌‌‌‌ షా మాట్లాడుతూ, కాంగ్రెస్‌‌‌‌, సీపీఎం, తిప్రమోతా పార్టీలకు ఓటు వేస్తే త్రిపురలో జంగల్‌‌‌‌ రాజ్‌‌‌‌ తిరిగి వచ్చేందుకు ఆస్కారం ఉందని హెచ్చరించారు.