బెంగాల్ బీజేపీదే : రామ్ మాధవ్

బెంగాల్ బీజేపీదే : రామ్ మాధవ్

బెంగాల్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్. బెంగాల్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్ లో ప్రతిఒక్కరి నుంచి బీజేపీకి, మోడీకి మంచి స్పందన లభించిందన్నారు. 2014లో యూపీలో వచ్చిన ఫలితాలే ఈ సారి బెంగాల్ లోనూ పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే మహకూటమి ఏర్పాటు విఫలమైందన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనూ మహకూటమి ఏర్పాటు సక్సెస్ కాలేదన్న రాం మాధవ్..ఎన్నికల తర్వాత కూడా అది సాధ్యం కాదన్నారు.