హైదరాబాద్ గోల్కొండ దగ్గర ఓ నల్లపిల్లి టెన్షన్ పెట్టింది. బ్లాక్ పాంథర్ మాదిరిగా ఉన్న నల్ల పిల్లిని చూసి స్థానికులు భయంతో వణికిపోయారు. ఫతే దర్వాజా దగ్గర ఓ మసీదులోకి బుధవారం రాత్రి నల్ల పిల్లి వెళ్లడంతో..దాన్ని చూసి పులి అనుకొని స్థానికుల్లో కలకలం రేగింది.
రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో చిరుత పులి వచ్చిందంటూ పుకార్లు రావడంతో రాత్రంతా జాగరణ చేశామని తెలిపారు స్థానికులు. వెంటనే జూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి మసీదులో ఉన్న పిల్లిని బంధించి… జూపార్క్ కు తరలించారు. స్థానికులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది.