
దేశంలోని వివిధ ప్రాంతాల్లో సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. నిరసనకారులకు మద్ధతుగా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తాను కూడా ప్రదర్శనల్లో పాల్గొంటానని బాలీవుడ్ నటుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా నిరసన తెలిపే సమయం ముగిసిందంటూ ఆయన బుధవారం తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.
‘పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ నిరసనలు గురించి తెలుసుకోవాలంటే నా ట్విట్టర్ పేజీని చదవండి. సోషల్ మీడియాలో మాత్రమే నిరసన తెలిపే సమయం ముగిసింది. డిసెంబర్ 19వ తేదీన ముంబైలోని క్రాంతి మైదానంలో కలుద్దాం అని అక్తర్ ట్వీట్ చేశారు.’
ట్వీట్తో పాటు, పౌరసత్వం చట్టం మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ గురించి తెలిపే ఒక చిత్రాన్ని కూడా ఆయన పంచుకున్నారు. ఇప్పటికే మహేష్ భట్, సుశాంత్ సింగ్ వంటి ప్రముఖులు కూడా సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారు.