అప్పుడు నో చెప్పాడు.. ఇప్పుడు సారీ చెప్పాడు.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు

అప్పుడు నో చెప్పాడు.. ఇప్పుడు సారీ చెప్పాడు.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు

కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. సమయానుసారం మనుషులు, వారి పరిస్థితులు మారుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ కూడా దానికి మినహాయింపేమి కాదు. దానికి అనుపమ్‌ ఖేర్‌(Anupam kher), రవితేజ(Raviteja)ల సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. అనుపమ్‌ ఖేర్‌ స్టార్ గా ఉన్నప్పుడు రవితేజను కసురుకున్నారట, ఇప్పుడు ఆయన హీరోగా చేసిన సినిమాలో ఓ పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ సంఘటనను గుర్తు చేసుకుని అనుపమ్‌ ఖేర్‌.. రవితేజకు సారీ చెప్పారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్‌ నాగేశ్వర రావు. దర్శకుడు వంశి తెరకెక్కించిన ఈ సినిమా.. అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా జరిగిన ఓ  ఇంటర్వ్యూలో నటుడు అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ..  1988, అక్టోబర్‌ 9న రవితేజ నా స్టూడియోకి వచ్చాడు. నేను షూటింగ్ ఉన్నాను. కాసేపటికి నా దగ్గరకు వచ్చి ఫొటో దిగుతామని అన్నాడు. దానికి నేను చాలా దురుసుగా లేదు.. పోండి అన్నాను. కానీ.. దానికి ఇప్పుడు నేను రవితేజకు సారీ చెబుతున్నా.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ALSO READ : Mama Mascheendra Movie Review: లాజిక్ లేని కన్ఫ్యూజన్ డ్రామా.. సుధీర్ బాబు ట్రిపుల్ ట్రీట్ ఎలా ఉందంటే?

ఇక ఈ ఈ వీడియో నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రవితేజ ఎదిగిన విధానం, 1988లో జరిగిన సంఘటనకు  ఇప్పుడు సారీ చెప్పడం.. ఈ రెండు చాలా గొప్ప విషయాలు అంటూ చేస్తున్నారు.