ఇజ్రాయెల్లో చిక్కుకున్న బాలీవుడ్ నటి .. సేఫ్గా ఇండియాకు

ఇజ్రాయెల్లో చిక్కుకున్న బాలీవుడ్ నటి .. సేఫ్గా ఇండియాకు

టెల్​అవీవ్: హైఫా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా అక్కడే చిక్కుకుపోయారు. భరూచా సైట్ సీయింగ్​కు వెళ్లారు. అదే టైమ్​లో ఇజ్రాయెల్​లో యుద్ధం మొదలైంది. దాంతో ఒక్కసారిగా ఆందోళనపడ్డ భరూచా.. ఇజ్రాయెల్​లోని ఇండియన్ ఎంబసీ అధికారులను సంప్రదించారు. అధికారులు ఆమెను ప్రత్యేక విమానంలో ముంబైకి పంపించారు.ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె ముంబైలో ల్యాండ్ అయ్యారు.

బెత్లెహెమ్​లో  రాజ్యసభ ఎంపీ..

రాజ్యసభ ఎంపీ వాన్వీరోయ్ ఖర్లూఖి కుటుంబం ఇజ్రాయెల్​లో చిక్కుకుపోయింది. మేఘాలయ నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఖర్లూఖి.. భార్య, కూతురు, కొందరు బంధువులతో కలిసి జెరూసలెం వెళ్లారు. వీరంతా ప్రస్తుతం బెత్లెహెమ్​లో ఉన్నారు. ఖర్లూఖిని సేఫ్​గా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా తెలిపారు.