టెల్అవీవ్: హైఫా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా అక్కడే చిక్కుకుపోయారు. భరూచా సైట్ సీయింగ్కు వెళ్లారు. అదే టైమ్లో ఇజ్రాయెల్లో యుద్ధం మొదలైంది. దాంతో ఒక్కసారిగా ఆందోళనపడ్డ భరూచా.. ఇజ్రాయెల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులను సంప్రదించారు. అధికారులు ఆమెను ప్రత్యేక విమానంలో ముంబైకి పంపించారు.ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె ముంబైలో ల్యాండ్ అయ్యారు.
బెత్లెహెమ్లో రాజ్యసభ ఎంపీ..
రాజ్యసభ ఎంపీ వాన్వీరోయ్ ఖర్లూఖి కుటుంబం ఇజ్రాయెల్లో చిక్కుకుపోయింది. మేఘాలయ నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఖర్లూఖి.. భార్య, కూతురు, కొందరు బంధువులతో కలిసి జెరూసలెం వెళ్లారు. వీరంతా ప్రస్తుతం బెత్లెహెమ్లో ఉన్నారు. ఖర్లూఖిని సేఫ్గా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా తెలిపారు.