
బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh bachchan), సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth).. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు స్టార్స్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ లెజెండరీ స్టార్స్ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Welcoming the Shahenshah of Indian cinema ✨ Mr. Amitabh Bachchan on board for #Thalaivar170??#Thalaivar170Team reaches new heights with the towering talent of the one & only ? @SrBachchan ???@rajinikanth @tjgnan @anirudhofficial #FahadhFaasil @RanaDaggubati… pic.twitter.com/BZczZgqJpm
— Lyca Productions (@LycaProductions) October 3, 2023
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల జైలర్(Jailer) మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పుడు అదే ఊపులో తన తరువాత సినిమాను కూడా మొదలెట్టేశారు. తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమాను జై భీమ్(Jai Bheem) దర్శకుడు టీజే జ్ఞానవేల్(TJ Gnanavel) తెరకెక్కించనున్నారు. లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది..
తాజాగా ఈ సినిమా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. ఈ ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ ఓ కీ రోల్ లో కనిపించనున్నారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్ గతంలో హమ్, అందా కానూన్, జిరఫ్తార్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తున్నారు ఈ లెజెండ్స్. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఇంకా ఈ సినిమాలో.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.