ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ర‌వీనా..అమీర్ ఖాన్

ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ర‌వీనా..అమీర్ ఖాన్

భారత ప్రధాని న‌రేంద్ర మోదీ ప్రతినెల నిర్వహించే మ‌న్ కీ బాత్ కార్యక్రమం తాజాగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సంధర్బంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏర్పాటు చేసిన మ‌న్ కీ బాత్ @100  జాతీయ స‌మ్మేళ‌నానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 100 మంది ప్ర‌ముఖులు హాజరయ్యారు.

ఇందులో బాలీవుడ్ నటులు రవీనా టాండన్, అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. 2014 అక్టోబ‌ర్ 3న ప్రారంభ‌మైన ఈ కార్యక్రమం..జాతీయ సంప్ర‌దాయంగా మారింది. మోడీ తన ప్రసంగాలతో..  దేశ అభివృద్ది ప్ర‌యాణంలో పాల్గొనేందుకు ల‌క్ష‌ల మందికి ప్రేర‌ణ‌గా నిలిచారు. ఇందులో భాగంగా విజ‌యాలు, సంతోషాలు, గ‌ర్వించ ద‌గిన వ్య‌క్తులను ప‌రిచంయ చేస్తూ వ‌చ్చారు.

ఇక తాజాగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సంధర్బంగా.. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ప్ర‌సార భార‌తి ఈ కాన్ క్లేవ్ ను నిర్వ‌హించింది. ఇంకా ఈ కార్యక్రమంలో గోవా రాష్ట్రానికి చెందిన పురాతన కావి పెయింటింగ్‌లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏటికొప్పాక చెక్క బొమ్మలు, ఒడిశా నుండి రాతిపై చేసిన పట్టచిత్ర పెయింటింగ్‌లు, అరటి కాడల ఫైబర్‌తో చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.