బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు

బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు

హైదరాబాద్: బేగంపేట్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్ పోర్టులో బాంబ్ పెట్టినట్లు ఆగంతకులు విమానాశ్రయ అధికారులకు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఎయిర్ పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపించి.. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ ఎయిర్ పోర్టును అణువణువు క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించింది ఎయిర్పోర్ట్ అథారిటీ. మరోవైపు ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ పోర్టులో బాంబ్ ఉందంటూ మెయిల్ పంపిన దుండగులను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.