హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రానికి బాంబ్ బెదిరింపు....బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రానికి బాంబ్ బెదిరింపు....బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

ఇటీవల ఎయిర్ పోర్ట్స్, స్కూల్స్,కోర్టులకు బాంబ్ బెదిరింపులు ఎక్కువయ్యాయి.  హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రంలో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్  వచ్చింది.  విషయం తెలిసిన ఉద్యోగులు ఆఫీసు నుంచి బయటకు పరుగులు తీశారు. వాతావరణశాఖ సిబ్బంది  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే  పోలీసులు,  బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.వాతావరణ శాఖ కేంద్ర దగ్గ పోలీసులు  భారీగా మోహరించారు.

ఆకతాయిల పని కావొచ్చని భావిస్తున్నా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా క్షణ్ణంగా కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు,ప్రజలు  టెన్షన్ పడొద్దని పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మెయిల్స్ పంపించింది ఆకతాయిలా? లేక ఏదైనా ఉగ్రవాద సంస్థనా? అనే కోణంలో సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు.

►ALSO READ | ED News: అనిల్ అంబానీకి ఈడీ షాక్: ముంబై, హైదరాబాద్‌లలో మెరుపు దాడులు

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇలాంటి బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం సాధారణమైపోయింది. అయినా పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.