కాంగ్రెస్​కు ఓటేస్తే అంధకారమే : బూర నర్సయ్య గౌడ్

కాంగ్రెస్​కు ఓటేస్తే అంధకారమే : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదని.. లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసినా ఉపయోగం లేదని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కేసీఆర్​కు ఇక రెస్ట్ ఇస్తే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ చిల్లులు పడ్డ కుండ అయితే కాంగ్రెస్ పార్టీ ఖాళీ కుండ అని.. బీజేపీ లంకె బిందె అని చెప్పారు. 

లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​కు ఓటేస్తే దరిద్రాన్ని తెచ్చుకున్నట్టేనని విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చెరువులు, పొలాలు, బోర్లు, జలాశయాలు ఎండిపోయాయన్నారు. రాష్ట్రంలో అప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయని, కాంగ్రెస్​కు ఓటేస్తే భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు.