మూసాపేట, వెలుగు: వీధి కుక్కల దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన కూకట్పల్లి పరిధిలో జరిగింది. కర్నాటక రాష్ట్రం బీదర్కు చెందిన సంజయ్, జ్యోతి దంపతులు కొంతకాలం కిందట సిటీకి వచ్చి కూకట్పల్లిలోని దయార్గూడలో ఉంటున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు అశోక్(12), మయాంక్(9) ఉన్నారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు మయాంక్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా వచ్చిన వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమికొట్టారు. గాయపడ్డ మయాంక్ను కుటుంబసభ్యులు ఉస్మానియాకు తీసుకెళ్లారు.