బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాస్త్ర దూకుడు

బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాస్త్ర దూకుడు

రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన మూవీ బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో  దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేందుకు సిద్ధమైంది. దేశీయంగా రూ.250 కోట్లకు చేరువలో ఉంది. అయాన్ దర్శకత్వం వహించిన ఈ  మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాపై మొదటి నుంచి భారీగా అంచనాలు పెట్టుకుంది చిత్ర బృందం. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నార్త్ ఇండియా, విదేశాల్లో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ విలన్ గా కనిపించారు. అలాగే అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు.
 
 బ్రహ్మాస్త్ర  మూవీ 2014 సంవత్సరం నుంచి నిర్మాణంలో ఉంది. మొత్తం చిత్ర యూనిట్ ఎన్నో త్యాగాల వల్ల ఈ సినిమా తెరకెక్కినట్లు మేకర్స్ ప్రకటించారు. అందరికంటే ఎక్కువగా రణ్‌బీర్ కపూర్ త్యాగం చాలా గొప్పది అన్నారు. ఆలియా భట్ కూడా చాలా ఏళ్లుగా తనకున్నా పూర్తి సమయాన్ని ఈ చిత్రానికి కేటాయించిందని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెలిపారు.

అయితే ఈ సినిమా మూడు పార్టులుగా వస్తుందని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో మొదటి పార్ట్ పూర్తి అవడంతో రిజల్ట్ తో సంబంధం లేకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.