ఘనంగా శ్రీవారి 14వ వార్షిక బ్రహ్మోత్సవం

ఘనంగా శ్రీవారి 14వ వార్షిక బ్రహ్మోత్సవం

హుజూర్ నగర్, వెలుగు: పట్టణంలోని గోదా పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అగ్ని ప్రతిష్ట, శాంతి పాఠం, గరుడ హోమం, చతుస్థానార్చన, పూర్ణాహుతి, ధ్వజారోహణం, స్వామివారికి వివిధ వాహన సేవలు, ఏదురుర్కోళ్లు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.