ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగి

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని  కాపాడిన రైల్వే ఉద్యోగి

ప్రాణాలు పణంగా పెట్టి ఓ చిన్నారిని కాపాడాడు.. రైల్వే ఉద్యోగి. మహారాష్ట్ర వాంగ్ని రైల్వే స్టేషన్ లో ఈ నెల 17న ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ రెండేళ్ల కుమారుడితో కలిసి ప్లాట్ ఫాంపై వెళ్తోంది. ఆ పిల్లగాడు.. నడుస్తూ నడుస్తూ.. ప్లాట్ ఫాం పై నుంచి సడన్ గా ట్రాక్ పై జారి పడ్డాడు. అదే టైంలో.. ఎదురుగా స్పీడుగా రైలు వస్తోంది. రైల్ సిగ్నల్స్ క్లియర్ చేస్తున్న పాయింట్ మెన్ మయూర్ షెల్కీ ఆ పిల్లాడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. రైలుకు ఎదురుగా.. ట్రాక్ పై పరుగెడుతూ.. పిల్లాడిని సేవ్ చేశాడు. తన ప్రాణాల్ని అడ్డుగా పెట్టి పిల్లాడిని కాపాడిన.. మయూర్ షెల్కీని అంతా అభినందిస్తున్నారు.