బంధువులంతా చూస్తుండగానే.. సోదరి డెడ్‌బాడీతో వేలిముద్రలు

బంధువులంతా చూస్తుండగానే.. సోదరి డెడ్‌బాడీతో వేలిముద్రలు

కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారనేలా ఇద్దరు అన్నదమ్ములు ప్రవర్తించారు. తమ సోదరి మరణించిన సమయంలో ఆ బాధ మాట మరిచిపోయి.. ఆమె ఆస్తి కోసం కొట్లాడుకున్నారు. ఆస్తి నాకు రావాలంటే నాకు రావాలని పోట్లాడుకున్నారు. ఎవరు ఏమైనా అనుకోనీ అన్నట్లుగా బంధవులంతా చూస్తుండగానే ఇద్దరు సోదరుల్లో ఒకతను తమ తోబుట్టువు మృతదేహం నుంచే వేలిముద్రలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మైసూర్ టౌన్ లోని శ్రీరాంపురకు చెందిన జయమ్మ అనే మహిళ ఇటీవల మరణించింది. ఆమెకు కోట్ల విలువచేసే భూములున్నాయి. సంతానం లేదు. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. జయమ్మ చనిపోగానే సోదరులిద్దరూ ఆస్తికోసం పోట్లాడుకున్నారు.  ఓ సోదరుడు ఏకంగా బాండ్ పేపర్లు తీసుకొచ్చి.. డెడ్ బాడీతో వాటిపై వేలిముద్రలు వేయించుకున్నాడు. బంధువులంతా చూస్తుండగానే వేలిముద్రలు వేయించుకుని వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది పోలీసుల వరకు చేరడంతో.. ఎంక్వైరీ మొదలుపెట్టారు.