ప్రొఫెసర్ జయ శంకర్ సార్ విగ్రహన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ మహాత్మా గాంధీ నగర్ బస్తీలో చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ నేత మహావీర్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు గోవింద్.. జనవరి 15వ తేదీ సోమవారం రాత్రి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రాజకీయ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. గోవింద్ స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ అనుచరుడిగా చలామణి అవుతున్నాడని.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ కు సంబంధించి ఉన్న సంబంధాలను ఆధారాలతో సహా నిరూపించి అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్టీలకు అతీతంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నేడు జరిగిన అవమానాన్ని తామ తీవ్రంగా ఖండించాలని.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గొప్ప నేత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తపై చర్యలు తీసుకునేంత వరకు ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.