
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారనుంది రాజకీయం. ఏప్రిల్ 8న ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ లో రెండో వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక అదే రోజు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో మహాధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఒకే రోజు ప్రధాని మోడీ పర్యటన, బీఆర్ఎస్ ఆందోళనలతో రాష్ట్రంలో రాజకీయం వాతావరణ మరోసారి వేడెక్కనుంది.
సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో రామగుండలో మోడీ మాట తప్పారని విమర్శించారు కేటీఆర్. వేలం లేకుండా బొగ్గగనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ సంకల్పాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన ధ్వజమెత్తారు. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే సింగరేణి జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు కేటీఆర్.