- కాంగ్రెస్ నేత నిరంజన్
హైదరాబాద్, వెలుగు: ప్రజల దృష్టి మళ్లించేందుకు మేడిగడ్డ టూర్ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో డ్రామా షురూ చేసిండని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారి దృష్టి మళ్లించేందుకే ఈ టూర్ ఏర్పాటు చేశారని, ఇదంతా పొలిటికల్ డ్రామా అని మండిపడ్డారు.
ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు రుసుం తీసుకోవద్దంటూ హరీశ్ రావు ఉచిత సలహాలు ఇస్తున్నారని, మీ ప్రభుత్వ హయాంలో ఎంత తీసుకున్నారని ప్రశ్నించారు. మేడిగడ్డకి కాంగ్రెస్ వాళ్లు కూడా రావాలంటున్న బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అక్కడకు తీసుకెళ్లినప్పుడు మీరు ఎందుకు రాలేదని నిరంజన్ నిలదీశారు.