తెలంగాణలో చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నయ్... కేసీఆర్ ​ట్వీట్​

తెలంగాణలో చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నయ్...  కేసీఆర్ ​ట్వీట్​

హైదరాబాద్: రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని మాజీ సీఎం కేసీఆర్​ ట్వీట్ ​చేశారు.   ‘నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతి రోజూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నరు. 

నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి’ అని కేసీఆర్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.