తమిళిసైపై చర్యలు తీసుకోండి: ఈసీకి బీఆర్ఎస్​ కంప్లయింట్​

తమిళిసైపై చర్యలు తీసుకోండి: ఈసీకి బీఆర్ఎస్​ కంప్లయింట్​

హైదరాబాద్, వెలుగు: మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైపై చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్ఎస్ లీడర్లు కోరారు. బుధవారం సీఈఓ వికాస్​ రాజ్​ను కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ లోక్ సభ బీజే పీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కాలనీలో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశా రని గుర్తుచేశారు. 

ఆ సమయంలో ఓటర్లకు ఆమె అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారని తెలిపారు. ఇది ఎన్నికల నియమావళిని(మోడల్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించడమేనని చెప్పారు. ఆమెపై ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చూడాలని కోరారు. రామమందిర నమూనాలను పంపిణీ చేస్తున్న ఫొటోలను ఈసీకి అందజేసినట్లు తెలిపారు. అదే విధంగా తమిళిసైపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోనూ బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు చేసింది.