వీసీ అయినంక నీ కళ్లు నెత్తికెక్కినయ్​!

వీసీ అయినంక నీ కళ్లు నెత్తికెక్కినయ్​!

బషీర్​బాగ్, వెలుగు :  కోఠి మహిళా వర్సిటీ వీసీని తిట్టిన కేసులో గోషామహల్ బీఆర్ఎస్ నేత​ గడ్డం శ్రీనివాస్ యాదవ్​పై సుల్తాన్ బజార్ పీఎస్​లో  కేసు నమోదైంది. సీఐ బాలగంగాధర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఈనెల 1న మహిళా వర్సిటీ వీసీ విజ్జులత చాంబర్​కు వెళ్లిన గడ్డం శ్రీనివాస్ తాను సోషల్ వర్కర్​నని పరిచయం చేసుకున్నాడు. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్​షిప్​లను అందిస్తున్నట్లు చెప్పాడు. తనకు వర్సిటీ తరఫున సన్మానం చేయాలని కోరాడు. వర్సిటీ అభివృద్ధికి ఆర్థికంగా సహకారం అందించాలని వీసీ సూచించారు. 

దీంతో శ్రీనివాస్ ‘నేను గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని. నువ్వేమైనా ఐఏఎస్​వా, ఐపీఎస్ ఆఫీసర్​వా?..  వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కినయ్​’.. అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వీసీ అతడిపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం శ్రీనివాస్​ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.