టికెట్ల కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ప్రదక్షిణలు.. హరీశ్, కవిత ఇళ్లకు క్యూ

టికెట్ల కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ప్రదక్షిణలు.. హరీశ్, కవిత ఇళ్లకు క్యూ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దించే పనిలో పడ్డాయి. సీఎం కేసీఆర్​ ఆగస్టు 21న మధ్యాహ్నం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్​ లిస్ట్​ విడుదల చేయనున్నారు. 

ఈ క్రమంలో టిక్కెట్లు రావు అని ప్రచారం జరుగుతున్న పలువురు నేతలు పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖ నాయక్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైదరాబాద్​లో ఉన్న మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత నివాసాలకు వెళ్లారు. 

తమకు బీఆర్​ఎస్ టికెట్​ కేటాయించాల్సిందిగా విన్నవిస్తూ.. సీఎం కేసీఆర్​ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మహిళా కమిషన్​ ఛైర్మన్​ సునీతా లక్ష్మారెడ్డి సైతం కవిత నివాసానికి వచ్చి టిక్కెట్ల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. నర్సాపూర్​కి ప్రస్తుతం మదన్​రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 

ఆ నియోజకవర్గ టిక్కెట్టును సునీతా రెడ్డి ఆశిస్తున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో, ఎవరికి మొండి చేయి చూపుతుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని క్షణాలు వేచి చూడాల్సిందే.