అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం జరుగుతోంది : హరీష్ రావు

అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం జరుగుతోంది :  హరీష్ రావు

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రలు అవాస్తవాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే హరీష్ రావు ఆరోపించారు.  అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.  వారి తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతామో అని భయపడి మైక్ కట్  చేశారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.  క్లారిఫికేషన్ ఇచ్చేందుకు సమయం అడిగితే సభ వాయిదా వేశారన్నారు.  మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారన్నారు.  అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర హరీష్ రావు మాట్లాడారు.  

కుటుంబపాలనపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు హరీష్ రావు.  తెలంగాణ అమరుల గురించి సీఎం రేవంత్ మాట్లాడితే   దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.  సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదన్నారు.  

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా పడ్డాయి.  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో చర్చ ముగిసింది. దీంతో  గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమెదం తెలిపింది. అనంతరం  అసెంబ్లీ సమావేశాలను తిరిగి బుధవారం పున: ప్రారంబించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 

 డిసెంబర్ 16వ తేదీ శనివారం రాష్ట్ర అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన తప్పులను ఎత్తిచూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్షం కూడా అధికార పక్షానికి ధీటుగా సమాదానమిచ్చింది.