నేడు ఢిల్లీకి కేటీఆర్‌‌

నేడు ఢిల్లీకి కేటీఆర్‌‌

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉండనున్నారు. కాగా, కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కవితకు మద్దతుగా, ఈడీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు ఈ నిరసనల్లో పాల్గొనలేదు. ఆర్‌‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌‌తో కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో వారు కూడా పాల్గొన్నారు.