మేం తల్చుకుంటే 48 గంటల్లో సర్కార్ కూలుతది: మహేశ్వర్ రెడ్డి

మేం తల్చుకుంటే 48 గంటల్లో సర్కార్ కూలుతది: మహేశ్వర్ రెడ్డి

 ఐదుగురు మంత్రులు మాతో టచ్ లో ఉన్నరు
 కోమటిరెడ్డి కూడా నితిన్ గడ్కరీని కలిశారు
 ఏక్ నాథ్ షిండేలా మారుతాననీ చెప్పారు
 మేం తల్చుకుంటే 60 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తరు
 బీఆర్ఎస్ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: తాము తల్చుకుంటే 48 గంటల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టచే చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కారు కూలడం పక్కా అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని హోంగార్డు అని అన్నారని, ఆయన ఆ స్థాయికే పరిమితమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేస్తున్నబీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్  రెండు లక్షల ఓట్లు మెజార్టీతో విజయం సాధించబోతున్నారని చెప్పారు. 

టచ్ లో ఐదుగురు మంత్రులు

బీజేపీతో ఐదుగురు రాష్ట్రమంత్రులు టచ్ లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి తాను ఏక్ నాథ్ షిండేలా మారుతానని చెప్పింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. రియల్టర్లు, వ్యాపారుల దగ్గర రేవంత్ రెడ్డి ఎంతెంత వసూలు చేశారో తన వద్ద చిట్టా ఉందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. దొంగ హామీలు ఇచ్చి వసూళ్లు చేసుకునేందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, ఆర్ అంటే రేవంతా..? రాహులా తనకు తెలియదని చెప్పారు.  బీజేపీ లోకి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాలని, అది తమ పార్టీ సిద్దాంతమని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ఏ ప్రభుత్వాన్నీ కూల్చదని అన్నారు.