దీపావళి టపాసుల ఫ్యాక్టరీ పేలిపోయింది.. 8 మంది మృతి

దీపావళి టపాసుల ఫ్యాక్టరీ పేలిపోయింది.. 8 మంది మృతి

టపాసుల ప్యాక్టరీలో పేలుడు సంభవించడంతో తీవ్రంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 29న తెల్లవారుజామున తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. 

ఈ ఘటనలో ఓ హోటల్​ భవనం కూలిపోగా, మరో నాలుగు బిల్డింగ్స్ పాక్షికంగా దెబ్బతిన్నాయి.  ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.  భవనాల్లో పలువురు చిక్కుకుపోయారు. వారిని కాపాడిన సిబ్బంది తీవ్రంగా గాయపడిన వారిలో 12 మందిని హాస్పిటల్​లో జాయిన్​ చేశారు.  

అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మరికొందరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రమాదంతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది.