బీజేపీ విధానాలతో దేశానికి నష్టం : బీవీ రాఘవులు

బీజేపీ విధానాలతో దేశానికి నష్టం :  బీవీ రాఘవులు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:     దేశంలో   బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశ వినాశనానికి దారి తీస్తున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గురువారం సీపీఎం జిల్లా కమిటి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా  వచ్చారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి ముందుకు రావాల్సిన అవసరం ఉందని. 

కూటమికి పెద్దన్న పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ .. అభ్యుదయ శక్తులను కలుపుకొనిపోవాలని చెప్పారు.  భారత దేశంలో మోదీ పాలనలో నియంతృత్వం తీవ్రంగా పెరిగిందని, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులపై కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు  సాగర్,    నాయకులు  గోపాల్,   నల్లవెల్లి కురుమూర్తి, పద్మ చంద్రకాంత్ పాల్గొన్నారు.