ఇవాళ(ఫిబ్రవరి 7) క్యాబ్ డ్రైవర్ల బ్రేక్ డౌన్ సమ్మె

ఇవాళ(ఫిబ్రవరి 7) క్యాబ్ డ్రైవర్ల  బ్రేక్ డౌన్ సమ్మె
  •     ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 
  • 12 గంటల వరకు సర్వీసులు బంద్

హైదరాబాద్​సిటీ/బషీర్​బాగ్, వెలుగు: యాప్​ ఆధారంగా నడిపే ట్రాన్స్​పోర్ట్​ వాహనాల డ్రైవర్లు శనివారం నిరసన చేపట్టనున్నారని  తెలంగాణ గిగ్​ అండ్​ ప్లాట్ ఫాం​వర్కర్స్​ యూనియన్​(టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది. ర్యాపిడో, ఉబర్,  ఓలాతో పాటు ఆటోలు, గూడ్స్​ వాహనాలు, పోర్టర్​ డ్రైవర్లు దేశవ్యాప్తంగాసేవలను ఎక్కడికక్కడే నిలిపివేయనున్నట్లు  తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో  భాగంగా హైదరాబాద్ లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి వేయనున్నామని యూనియన్​ అధ్యక్షుడు షేక్​ సులావుద్దీన్​ వెల్లడించారు. గిగ్​ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. గిగ్​వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రేటు నిర్ణయించి కంపెనీల దోపిడీని అరికట్టాలన్నారు. 

అలాగే..ఆటో, క్యాబ్, టాక్సీ, లారీ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల  12న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు బంద్  నిర్వహించనున్నట్లు రాష్ట్ర మోటార్  కార్మికుల సంఘాల జేఏసీ ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు అమలుతో ఆటోడ్రైవర్ల ఆదాయంపై తగ్గిందని తెలిపింది. ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలను నియంత్రించాలని కోరింది.