తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై దగ్గర ఓ టాటా సుమోను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో  ఏడుగురు మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన క్షతగాత్రులను వెంటనే  సెంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదం గురించి తెలియడంతో..  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా  టాటా సుమోలో  వచ్చిన వారంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది.  తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయం నుంచి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ALSO READ :- ODI World Cup 2023: భారతీయులను క్షమాపణ కోరిన పాక్ క్రీడా జర్నలిస్ట్