తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై దగ్గర ఓ టాటా సుమోను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను వెంటనే సెంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియడంతో.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా టాటా సుమోలో వచ్చిన వారంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయం నుంచి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ALSO READ :- ODI World Cup 2023: భారతీయులను క్షమాపణ కోరిన పాక్ క్రీడా జర్నలిస్ట్