NSUI నేత బల్మూరి వెంకట్పై కేసు నమోదు..

NSUI నేత బల్మూరి వెంకట్పై కేసు నమోదు..

ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్పై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే..శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రాత్రీ పగలు మందుబాబులకు అడ్డాగా మారిందంటూ ఆదివారం తెల్లవారుజామున బల్మూరి వెంకట్ స్థానిక బార్లు మూసివేయాలంటూ హల్ చల్ చేశారు. దీంతో ప్రభుత్వ అనుమతులు ఉన్న బార్లను కూడా మూసివేయాలంటూ నిర్వాహకులను బెదిరించారని.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసినట్లు వెంకట్పై బార్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బార్ లోకి అక్రమంగా ప్రవేశించి కస్టమర్లను ఇబ్బందులకు గురి చేసినందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో బల్మూరి వెంకట్పై సెక్షన్స్ 448,290,341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.