- పీఈటీని చితకబాది పోలీసులకు అప్పగించిన బాలిక కుటుంబసభ్యులు
గండిపేట, వెలుగు : విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)పై అత్తాపూర్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం... సిటీకి చెందిన ఓ బాలిక అత్తాపూర్ ఎస్ఆర్ డిజి స్కూల్లో చదువుతోంది. అక్కడ పీఈటీగా పనిచేస్తున్న విష్ణు కొంతకాలంగా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెకు ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు.
బాలిక కుటుంబ సభ్యులు విద్యార్థి నాయకులతో కలిసి శనివారం ఉదయం స్కూల్కు చేరుకున్నారు. పీఈటీ విష్ణును బయటకు తీసుకొచ్చి చితకబాది అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. స్కూల్లోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. విష్ణును స్కూల్ నుంచి వెంటనే తొలగిస్తామని మేనేజ్ మెంట్ తెలిపింది. అతడిపై కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.