భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు

భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు

హైదరాబాద్: రాచకొండ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలు తో కేసు నమోదు చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా లోని  సర్వే నంబర్ 152 లో 90 ఎకరాల భూమి విషయం వివాదంలో ఉంది. ఈ వివాదంలో తలదూర్చినట్లు ఎమ్మెల్యే పై ఆరోపణలు వచ్చాయి. ఉప్పల్ ఎమ్మెల్యే తో పాటు  కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ మీద జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దౌర్జన్యానికి పాల్పడినట్లు, మాట వినకపోతే చంపుతామని కూడా బెదిరించారనే ఫిర్యాదుతో ఐపీసీ 120,166a,167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశాడని కోర్టు కు వెళ్లి కోర్టు కు వెళ్లిన మేకల శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.